Tuesday, April 28, 2015

మనిషిని బోలిన మనుషులుంటారా అంటే మాపోస్టుమ్యాన్ వెంకటేశ్వర్లుశివరావు   అనే తెలుగు సినిమాల్ల్లోనిపాత నటుడినీ ప్రక్క ప్రక్కగా నిలబెడితేఇద్దరుమిత్రుల్లో 'అక్కినేని నాగ్గాడు'ను సరిపోలేలా ఉంటారు.
అయితే విశేషం యేంటంటే మా 'పోలిశెట్టి  అనబడే శివరావు, అందరికీ ఓ చిన్న "రాముల వారిదగ్గరుండే హనుమంతుడులా'ప్రత్యక్షమై తన చేతనయినంత సాయం అందిస్తాడు.


మా చిన్నప్పుడు మా హైస్కూలు ముందు వాగు  చిన్న పాటి వానకుకూడా ఒడ్డంటా ప్రవహించేది .అక్కడ ఈ శివరావు అనబడే ఆంజనేయుదు[ తోకలేని]తయారయే వాడు.ఈ ఒడ్డునుంచి ఆ వొడ్డుకుపేద్ద మోకు ను లాగి అవతలైంకోమనిషిని పట్టుకోడానికి నిలబెట్టి అందరినీ అవతలి ఒడ్డుకు  చేర్చే వాడు.మాకందరికీ   స్కూలు కెళ్ళాలన్న ధ్యాస కన్నా ,నీళ్ళలో నడిచే అనుభూతి మమ్మల్ను కట్టి పడే సేది.అది ఆ శివరావు టికి అందరిపైన ఉండే ప్రేమనే చెప్పుకోవాలి..సహకరించాలన్న ఆత్మీయత అతని తరగని ఆస్తులు,మా పోలిశెట్టికి ఓ మైకు సెట్టూ నాలుగు పె ట్రొ మాక్సు లైటులు  ఉండే వి.అన్ని    శుభకార్యాలకూ   అద్దెకిచ్చి కొంత ఆదాయం పొందుతుండే  వాడు.ఆమైకు సెట్టు కు అహుజా బాట్టరీ ఉండేది,నాలుగు గొట్టాలూ HMV రికార్డుల పెట్టే ఉండేది.ఓ పదేళ్ళు ఆ సరంజామా తో కాలక్షేపంచేసాక పోటీగా టేప్ రికార్దులసెట్టుతోమరొకడు అవతరించాక ఈ    రికార్డుల భాగోతానికి క్రమేపీ తెరపడింది.
ఒక్కో సారి పెళ్ళిళ్ళ   బ్యాటరీ వీకయి పంతులుగారి గొంతు పీలగామారితే పురోహితూలవారిని ఆయన్ను ఓ గ్లాసుడు పాలు తాగమని చెప్పి ఆ బ్యాటరీ పైన ఉండే  ఆరు కానాల్లో సోడాలు గొట్టి పోసే వాడు,మళ్ళీ ఝామ్మని మైకు పాటలను బిగ్గరగొంతులో  ఘనంగా అందుకునేది. రికార్డులకంపెనీ వారు ఈ తిరిగే మట్టి రికార్డుల స్థానంలో క్రమేపీ టేపుల్లోకి దిగడ0తో ఈ వ్యవహారం మూత బడ్దా పెట్రో మాక్సులు కొన్న్నాళ్ళు బాగానే నడిచింది.ఈ లైట్లూ బాగా పాతబడి   మంగళ సూత్రం కట్టే టైంకో తలంబ్రాల సమయానికో కొండెక్కుతామని మొరాయించి విసిగించేవి.ఇక ఆ కార్యక్రమాలూ వెనుకంజ వేయడo మొదలెట్టాకబండి డాన్సు ల  కాంట్రాక్టులు       మొదలెట్టాడు.

బండి  డాన్సులంటే అదేనండీ  టైరు బండి బల్లపరుపు చక్కమీద వేదికగానిలిపి దానిపై  యూరియా గొతాలు మందం గాను  మెత్తగానుయూరియా గొతాలు మందంగాకప్పిదానిమీద అమ్మాయిలూ అబ్బయిలను ప్రక్క వూర్లనుండికొనితెచ్చి ఆడించే వారు.పల్లెల్లో అది ఓకాలక్షేపం అప్పట్లో.అదికొన్నాళ్ళు గడిచాక
జనం ఆ బొడి[ ద్యాన్సు చేసే అమ్మాయికి పేలొచ్చాయని వాళ్ళ అమ్మ్మా నాన్నా బోడిగుండు జేయిస్తే ఆపెౠ వచ్చి ఓ అయిదేళ్ళపాటు నిలబదిపోయిండి. ఇక ఆతర్వాత అంతకన్నా కొత్త సినిమా పాటలతో
నరసరావుపేట శివరాత్రి ప్రభలమీద రంగు రంగుల లైట్లతో
కళ కళగా ఒచ్చేక ఈ కళా పోలిసెట్తికి దూరమయింది.కొన్నాళ్ళు పోస్ట్ మ్యాన్లసంఘానికి గౌరవా ధ్యక్సుడిగా కూడా వెలగబెట్టి కొడుక్కు ఆ తపాలా  శాఖలోనే ఉద్యో గం వచ్చాక ఆ పదవికీ దూరమై కొడుకు దగ్గర అత్తా కోడళ్ళ తగూలూ ధారావాహికంగా రావడం మొదలెట్టాక దెభ్భయ్యో పడిలో ఆ ఉద్యోగానికి దూరమై పొన్నె కల్లులో ఉండడం  ప్రారంభించాడు.
మేము స్కూల్లోచదివేవ్రోజుల్లో సైకిలుతొక్కడం నేర్చుకోవడం ఓ బ్రహ్మ విద్య అనుకుకునేవాళ్ళం.ఎస్సెల్సీకొచ్చినా సైకిలి తొక్కడం రాదంటే అవమానమని దొంగా చాటుగా సైకిల్ నేర్చుకోడానికి మా శివరావే ఆధారం.శివరావు దగ్గర నాలుగుపెద్ద సైకిళూ న్రెండు చిన్న సైకిలుండేంది.కాళ్ళందాలంటే బండరాయి సాయంలేకుండా చిన్న సైకిలే వాటంగా అందుబాటులొ వుండే ది.శివరావు లేనప్పుడు [అంటే పోస్ట్ బ్యాగులు తీసుకురావడానికి కొన్నాళ్ళు పొన్నెకల్లు కొన్నాళ్ళు సిరిపురం 10 గంటలకల్లా బయలుదేరివెళ్ళేవాదు మళ్ళీ అన్ని పనులూ ముగించుకుని వచ్చేసరికి నాలుగున్నరఓ అయిదో అయేది.ఈలోపు స్కూలునుంచి రాగానే వాళ్ళ నాన్ననో [రామస్వామి] లేదా తమ్ముడు వెంకటస్వామినో అడిగి తీసుకుని ఓ గంటతొక్కుకుని మోకాలి మోచ్చిప్పలు పగలగొట్తుకుని వచ్చే వాళ్లం .అలా వాళ్ళ బాగా పెడ్దవాదవడం మూలానా తమ్ముడు తాగుడుకలవాటు పడి డబ్బులెక్కల్లో తేడాలు రావడంతో ఆ వ్యాపారానికి మంగళం పాడాడు.


మా హనుమంతుడికి మొక్కలుపెంచడమ్మీద మహాశ్రద్ధ.మా రెండో అ బ్బాయి  పెళ్ళికొచ్చినప్పుడు మాఇంటి తోటను జూసి గుండెలు బాదుకుని ఇల్లానా తోటను పెంచేదీంటూ ఒ  ల్లా వుండి   గొప్పులుదీసి మొక్కలు నాటి[ఉన్నవే ఎండిన ఆకులనురాల్చి కొమ్మలను కత్తిరించి బాగపోషణజేసి మళ్ళీ పది పదిహేనురోజుల్లో ఎరువుతో వచ్చి వేసి ఎలా ంక్కలనెలా పెంచాలో చప్తాను అంటూ, మళ్ళీ తనొచ్చేటప్పుడు ఓ మల్లె మొక్కనూ, గోరింటమొక్కనూ తెచ్చినాటి వాటికి సంతుష్టిగా గొర్రె పెంటనుదెచ్చి ఎరువుగా ఏసి నీళ్ళు పెట్టి మళ్ళీ పదిరోజులకొచ్చి మొక్కలు కాస్త నిలదొక్కుకోవడంచూసి తృప్తిపడి వెళ్ళాడు,ఆతవాతమళ్ళీ ఓ నెలకొచ్చి అక్కదక్కడాపెరిగిన గడ్దిని,కలుపుమొక్కలనూ పీకి,గోరింట కొమ్మలు విరువకండా ఆకులుమాత్రంకోస్తూ కాసిని నీళ్ళు అప్పుడప్పుడూ చిలకరిస్తే బాగా అల్లుకుపోయిపెరుగుతుందనీ చెప్పి ఏందుకు ఇంతహ్=గా శ్రమకోర్చి త్చ్చావు వెంకన్నా అంటే నాది శ్రమేముందబ్బాయ్ బస్సువాడే గదామోసేది,మనం టిక్కట్ కొనికూర్చుటే వాడే మోసుకొచ్చడని తొర్రిపళ్ళలోంచి నవ్వి అమ్మాయికి[మా ఆవిడకి] మల్లెపూలూ,గోరింటా కూ ఇష్టమని మా ఆవిడ ఇచ్చి పంపింది నేను తే చ్చి నాటాను అంతే అని నవ్వే వాడు.
ఆమల్లె చెట్టు రెండురోజుల్లో రెండువందలు పైగా ముద్ద గా   పూలనుపూస్తే ఆవిడానందంగా లక్స్మి అమ్మవారికీ లలితమ్మ వారికీ అష్టోత్తరసతనామాలపూజలను దీక్షగాజేసి కుదుటబడింది.ఈమల్లెలెంత ఘుమలాడుతున్నాయో చూడండి అని తను అంటే రావెల వారిసంస్థానమంటే ఉన్నగొప్ప అల్లాగే ఘనంగా ఉంటాయి ఏదయినా అని ఓ మా టి వదిలి నవ్వుకుకున్నాను ముసి ముసిగా.


మానాన్న[గారు] పోయినప్పుడు అతన్ని దు ఖాన్ని ఎవెరూ ఆపలేకపోయాం.పెద్ద పంతులుగారు [పెద్ద  నాన్న] మంచానబడి దాటిపోయారు,ఈయనకేంతొందరొచ్చిందని తిరుగుతూ తిరుగుతూ ఉన్న మనిషి ఇలా పోతే నాకు మంచీ చెడు చెప్పేదెవరు? అని పెద్దగా శోకండాలు పెడుతుంటే వచ్చినె వాళ్ళందరికీ వీడురానిజమైన బంటంటే అని నోరు నొక్కుకున్నారు.

మళ్ళీ నెలరోజుల్లో ఒస్తానని వెళ్ళాడు. సంక్రంతికొచ్చాడూగదా అని అతనికి కొత్త ధోవతీ,పైపంచా పెడితే తీసుకోనంటే తీసుకోనని గొడవ.ఆవిడేంఓ వాళ్ళావిడకని ఓ కొత్తచీరా జాకెట్ ఇచ్చి పంపింది అతనితో. ఎంతో మురిసిపోయాడూ, మళ్ళే ఆవిడత్ఫో వస్తానని వెళ్ళీనవాడూ అందరినే ఇక్కడె వదిలి ఒక్కడూ ఒంటరిగా వాళ్ళ పంతులుగార్ల దగ్గరకు వెళ్ళాడూ.అక్కడ వాళ్ళమ్మాయి గారు కలిస్తే ఈ పూలమొక్కలన్నీ వదిలి మా అబ్బాయిని ఒమరిగాడిని చేసీ ఎలా చ్చావమ్మా అని అడిగే వుంటాడు ఆ దివ్యధామంలో.

Monday, April 27, 2015

ఆభిలాష
--------------

నిన్ను స్పృశించకుండానే
అనుభూతి సారాన్ని గ్రోలాలనీ
నాలుకతో తడపకుంజ్డానే
నీ అధరామృతాన్ని
 రుచించుకోవాలనీ

ఊపిరితిత్తుల సాయమడగకుండానే
నీసాన్నిహిత్యంలోశ్వాసించాలనీ
పరిమళసౌరభాన్నంతటినీ
నీ కుసుకోమలమైన తనూలతపై
భ్రమరం వాలిపోకముందే చేరుకోవాలనీ
ఘ్రాణేంద్రియాల సాయమడగకుండానే
శబ్దాలనన్నింటినీ స్పష్టంగా వినాలనీ

పశ్చాత్తాపంతో పనిలేని
ప్రాయశ్చిత్తం తో తృప్తిపడాలనీ
ప్రాణంలేకుండానే జీవనం
శ్వాసించకుండానే
 గుండెను ఊప్రితో అనునిత్యం నింపాలనీ
సాగించగలగాలనీ
మృత్యు ముఖం చేరుకోని విధంగా
నీ సన్నిధిలోనే సమాధిస్థితి నందాలనీ
నాలో చిరంతనంగా ఉప్పొంగుతున్న అభిలాష.
-----------------------------------
[ఓ ఆంగ్ల కవిత చదివాక]

Thursday, April 23, 2015

జయ జయహో కవిత్వం
=======================

నేనొక పుస్తకాన్ని చదివితే
అదినన్ను శీతలీకరించినతర్వాత
యేఇతర ప్రక్రియా నన్ను
వెచ్చగా ఉంచలేదనీ తెలిసికోగలిగితే

నేనిక నాశిరస్సుపై భాగాన్ని పోగొట్టుకున్న
అనుభూతిని పొందగలిగితే ,
అది కేవలం నేను చదివిన
కవిత్వపు పుస్తకం ప్రభావమేనని అర్ధం చేసుకోండి.

-----------------------------ఎమిలీ డికెన్సన్
పుట్టింది అత్యంత సిరిసంపదలు తొణికిసలాడే భాగ్య వంతుల కుటుంబంలో ,బాగా చదువుకుని ఉద్యోగం చేయవలసిన అవసరంలేడు.

తనకున్న స్వతంత్ర భవాలను అణచుకోలేక, తన స్వేచ్చహ ను నియంత్రించుకునే

తనజీవితకాలంలో 2 వేల పైగా కవితలల్లినా,తనను తాను
స్వచ్చందంగా పరిచయంచేసుకోవాలన్న యావలేకపోవడంతో
తన కేవలం పదికవితలను మాత్రమే పత్రికల్లో వెలుగు చూసిన దురదృష్టం ఆమెది.సుదీర్ఘమైన కవితలు కాకుండా అల్పాక్షరాలలో అనల్పమైన భావాలను పొదిగిన ప్రతిభా సమన్విత ఆమె.

వాల్ట్ విట్మన్ తరువాత అంత స్థాయిలో పేరు ప్రతిష్టలు రావల్సిన కవయిత్రికూడా ఆమె.సాంఘిక దృక్పధంలోనూ, ఆధ్యాత్మిక ప్రపంచంలోనూ అమృతగుళకల్లాంటి కవితలామెవి.

    ప్రప్రధమంగా ఆవిడమరణానంతరం 1890  వ సంవత్సరంలో వెలువడిన ఆమె కవితా సంపుటి కేవలం రెండు సంవత్సరాలలో
11 పైగా పునర్ముద్రణలకు నోచుకున్న ఘనత ఆమెది.
ఎప్పుడూ శ్వేతవస్త్ర ధారిణిగా ఉంటూ యే మత విశ్వాసాలకూ అంధంగా అనుసరంచబోనని భీష్మించుకున్న వైశిష్ట్యం ఆమెది.ఆవిడ ముప్పయ్యవ యేటినుంచీ బాహ్య ప్రపంచంతో సంబంధాలను పూర్తిగా రద్దుచేసుకుని ఒంటరిజీవితాన్ని నాలుగు గోడలమధ్య నే తన కవితలనల్లుకుంటూ నోటు పుస్తకాలను పూర్తిగా కవితలతోనింపుతూ కాలం గడపడం జరిగింది.ఈమె ఈ స్థితికి ఎందరో ఎన్నో విధాలుగా అనారోగ్య కారణాలని ప్రచారంచేసినా
వాస్తవానికి మంచానికే పరిమితమైన జబ్బుల కారణంగా ఆమె      ఆవిడ ముప్పయ్యవ యేటినుంచీ బాహ్య ప్రపంచంతో సంబంధాలను పూర్తిగా రద్దుచేసుకుని ఒంటరిజీవితాన్ని నాలుగు గోడలమధ్య నే తన కవితలనల్లుకుంటూ నోటు పుస్తకాలను పూర్తిగా కవితలతోనింపుతూ కాలం గడపడం జరిగింది.ఈమె ఈ స్థితికి ఎందరో ఎన్నో విధాలుగా అనారోగ్య కారణాలని ప్రచారంచేసినా
వాస్తవానికి మంచానికే పరిమితమైన తల్లి జబ్బుల కారణంగా ఆమెకు సేవలందిచడానికే మొగ్గుచూప పరిమితమయిందని తర్వాత తెలిసిన సత్యం. ఆమే తాతగారు అక్కడే ఆమె చదివిన విద్యాసంస్థకు వ్యవస్థాపకుడు. ఆమె తంద్రి పేరుమోసిన న్యాయవాది శాసన సభ్యుడుకూడా.ఆమెను చదవమని బలవంతం చేయకుండా సోదరుడు ఆమెకు రక్షణ కవచంగా నిలిచి తనమానాన తను తన పెద్దదైన అమహ్ పురానికీ వందల యెకరాల ఉద్యానవనాలకూ పరిమితమైనది.
 సంప్రదాయ బద్ధంగా కవితలల్లలేదనీ
చందశ్సునూ,వ్యాకరణాన్నీ అనుసరించలేదన్న
విమర్శలే ఆమెపై,పరిశీలకులూ, విమర్శకులూ
సంధించడంతో ఆవిడ కవితాహృదయాన్ని గాయపర్చడమే
అర్ధంచేసుకుని అవగాహనతో ఆదరించిన వారు లేరనే చెప్పుకోవాలి.

ఆవిడకు మానసిక స్థితి సరిగ్గాలేదనీ చిత్తచాంచల్యముందనీ
అనవసరపు ప్రచారాలతో ఆమెను విసిగించి ఆమె ప్రతిభకు
అడ్దుగానిలిచి ఆమె ప్రతిష్టకు భంగం వాటిల్లజేసిన వారే ఎక్కువ.
అందుకే ఆమె ఈ పరిణామాలతో విసిగుచెంది,బాహ్య ప్రపంచంతో
సంబంధ బాంధవ్యాలను క్రమేపీ తగ్గించుకున్నారు.తన గదికో విశాలమైన ఉద్యాన వనాలకో పరిమితమై రోకుకు మూడుకవితలు
తగ్గకుండా రచనలు చేయడం జరిగింది. ఆవిడకు ప్రధమార్ధంలో
ప్రచురితమైన కవితా సంపుటులలో సంపాదకులు స్వేచ్చహగా
ఆమె భావాలకు విఘాతం కలిగేలా మార్పులూ చేర్పులూ చేసి
ప్రపంచం ఆమె ఉద్దేశాలను అపార్ధంజేసుకోవడానికి దోహదంచేసి
ద్రోహం చేసారనే చెప్పుకోవాలి.ఆంద్లో ఆమె ఎన్నొ సందర్భాలో రాసి
అతకకు మాత్రమే పరిమిత కవితలెన్నో తరువాత ఆమె చనిపోయిన చాలా సంవత్సరాలతర్వాత చదువరులకు అందు బాటులోకి రావడం
జరిగింది.1955 దాకా ఆమె కవితలు అధీకృతమైన రీతిలో వెలువడలేదనే చెప్పుకోవాలి.

కొందరు దేవాలయాలకువెళ్ళి
శాంతికాముకులౌతే నేను ఇంటిదగ్గరనుండే
ఆ సమ్యన దృక్పధాన్ని అలవరచుకున్నాను.
---------------------------------




  ఆవిడ ముప్పయ్యవ యేటినుంచీ బాహ్య ప్రపంచంతో సంబంధాలను పూర్తిగా రద్దుచేసుకుని ఒంటరిజీవితాన్ని నాలుగు గోడలమధ్య నే తన కవితలనల్లుకుంటూ నోటు పుస్తకాలను పూర్తిగా కవితలతోనింపుతూ కాలం గడపడం జరిగింది.ఈమె ఈ స్థితికి ఎందరో ఎన్నో విధాలుగా అనారోగ్య కారణాలని ప్రచారంచేసినా
వాస్తవానికి మంచానికే పరిమితమైన తల్లి జబ్బుల కారణంగా ఆమెకు సేవలందిచడానికే మొగ్గుచూప పరిమితమయిందని తర్వాత తెలిసిన సత్యం. ఆమే తాతగారు అక్కడే ఆమె చదివిన విద్యాసంస్థకు వ్యవస్థాపకుడు. ఆమె తంద్రి పేరుమోసిన న్యాయవాది శాసన సభ్యుడుకూడా.ఆమెను చదవమని బలవంతం చేయకుండా సోదరుడు ఆమెకు రక్షణ కవచంగా నిలిచి తనమానాన తను తన పెద్దదైన అమహ్ పురానికీ వందల యెకరాల ఉద్యానవనాలకూ పరిమితమైనది.


ఎమిలీని మొదటిసారిగా సాహిత్యానికి పరిచయంచేసి ప్రోత్సహించిన ఘనత ఆమె ప్రధానా చార్యులు
  

Wednesday, April 22, 2015

యువకవితా హేతువు---
--------------------రావెల
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్

వయసంటూ యేమాత్రం మళ్ళని
యువ కవయిత్రులారా1
చెంపలక్రింద దాకా జారిపడిన
కేశ సంపదతో పాతబడిన
జానపద పల్లవులతో వడలిపోయి
దవడ ఎముకలపైకి జారి
కదలక్రింద నిలిచిన గాజుగోళాలా
మిగిలిపోయిన నేత్ర ద్వయాలతో
శవాలలో స్తంభించి పోయిన నెత్తురు చుక్కల్లా
చలనం కలిగించలేని కవితలల్లి మీరు సాధించహలిగిన
సత్ఫలిత మేమున్నది?

ఉడకబెట్టిన ద్రాక్షపండ్లలా
స్రుక్కి సోలి వాలిపోతారెందుకు?
అల్లగే వాస్తవానికి నేనూ ఒకప్పుడు
ఇండే దాన్నిలే అవన్నీ అంత
 తేలిగా మరచిపీయే విషయాలాచెప్పండి?
ముసుగులు కప్పుకోవాల్సిన అవసరమేమున్నది?
నేనూ ఓ పురుష కవిపుంగవుడనై ఉంటే
వాళ్ళను సముదాయించే ప్రక్రియను చేపట్టి
సఫలీకృతమై సంతసించే దానిని.

బహుశా వారికిలాగానే
అపజయమే నన్ను గాఢంగా కౌగలించుకుని
భల్లూకంలా పట్టుకుని వదలను
పొమ్మంటూ భీష్మించుకునేదేమో కూడా--
  Margaret Atwood      ఆంగ్లకవితకు అనుసృజన]
=========================================
హిందీ చీనీ భాయీ భాయీ ఎప్పుడు పుట్టిందో ఎరుకేగాని
మావూరిలో కులాల,మతాలకతీతంగా సహజీవనం చేయడం
మాకన్నులెదుట మేము గాంచిన సత్యం.ఇది నిజం.నూటికి నూట యాభయ్యి శాతం నగ్న సత్యం.


మా ఇంటిపేరిట ఒక పీరుండేది.ముహర్రం పందుగకు ఒక పదిరోకులముందు,పదోపరకో తీసుకుని మాపీరును ముస్తాబు చేసే వాళ్ళు. పీర్ల సావిడి వైపు వెళుతుంటే ఇది మాపీరురా అని మిత్రులకు దాన్ని చూపిస్తూ గర్వంగా చెప్పుకునే వాళ్ళం.
మావూర్లో మోతాదు ఖాసిం[సయ్యద్ ఇంటిపేరు] చాలామంది తెలుగుకన్నా స్పష్టంగా తెలుగు మాటాడే వాడు.మాపాలేర్లలో అబ్దుల్లా పదేళ్ళపాటు నమ్మకంగా ఉండే వాడు.తర్వాత మతంలో పెద్దగా మారుతూ మాదగ్గర మానేసాడు.ఆ నెలరోజులూ మరలా పీర్లను గుండాన పడ్డాయ్ అనుకునే దాకా నీచు తినకుండా నిష్టగానే వుండే వాడు. వాళ్ళాన్నయ్య కూడా అంతకు ముందు మాదగ్గరే వుండి పొలం పనులు చేస్తుండే వాదు. ఆతర్వాత మీర అనబదే వాడు రెండు దశాబ్దాలపాటుగా నమ్మిన బంటులా వుండి మమ్మల్ను ఎత్తుకు తిప్పే వాడు. అల్లగే బాపూ సాహెబ్ మాస్టారు చాల అభిమానం గా ఉండే వాడు మేమంటే.అలాగే రాయపూడినుంచి జానీ అనే బలాఢ్యుడు మా నేస్తంగా వుండి ప్రాణానికి ప్రాణమన్నట్లు వుండే వాడు.మాతోబాటే

గుంటూరులో మేమద్దెకున్న రూములోనే వుండి తనపనులు చక్కబెట్టుకుని వెళుతుండే వాడు. మావూర్లో అప్పట్లో ఉర్దూ స్కూలు వుండేది.ముఖ్యంగా అల్లీ సాహెబ్ మాస్టారూ మా పెదనాన్న ఒక తరం క్రిందటి నేస్తాల్ల కలిసిమెలసి తిరుగుతుండే వారు. వాళ్ళబ్బాయి రాయపూడిలో [ఇప్పుడు కొత్త రాజధాని ప్రాంతంలో ఉంది.] జామకాయతోటలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుండే వాడు.

సంవత్సరానికొకసారి జామకాయల బస్తాతో దిగి [మా అన్నయ్యకు మంచి దోస్త్] నాల్రోజులు మాఇంట్లోనే వుండి వెళ్ళే వాడు.అలాగే పైగంబరకవిగా పేర్వడసిన సుగం బాబూ, దేవీప్రియా,మంచి స్నేహితులుగా మెలిగే వాళ్ళం. సుగ్మ తన రెక్కల కవితా ప్రక్రియ ఆలోచనను నాతోకూడా పంచుకుని తనకందిన ప్రతిరెక్కల కవితా సంపుటినీ పంపి నన్నూ రెక్కలకవిని చేసి,  నా" వెలుగు రేకల' కవితా సంపుటి ఆ విర్భావానికి దోహదం చేసి ఆ కవితా సంపుటి ఆవిష్కరణ రోజు పాతమిత్రులందరితోనూ కలిసి వచ్చి,'మురళి' గారి సారధ్యంలో ఘనంగా హైద్రాబాదులో ఓ ఉత్సవం లాగా జరిపాడు.ఆ సభకు శ్రీ సలీం గారు విచ్చేసి తన సంతోషాన్ని మాతో పంచుకోవడం ప్రత్యేక ఆకర్షణ. మా ఆవిడను అమ్మయీ అనిపిలుస్తూ .ఎంతో ప్రేమగా మసలే వాడు.ఇవన్నీ ఎందుకంటే పీర్లు గుండాన బడే ప్రక్రియలోనూ వాళ్ళ పoడుగలప్పుడు ఖీర్ అవీ ఇచ్చిపుచ్చుకునేవాళ్ళు.
అల్లాగే మాపండుగలప్పుడు మేమూ అప్పచ్చులు ఇచ్చె వాళ్ళం.అలాగే గుంటూరులో ఇనుప బీరువాల కంపెనీ ఉన్న     గాలీబూ  ,పండుగకు పిలిచి సంతోషంగా ఖీరు పంచాడు.అలాగే మాతోపాతే పనిజేసిన 'వలీ' ప్రతి పండుగకూ సేమ్యాలు తెచ్చి ఇచ్చే వాడు.ఇలా ఇచ్చిపుచ్చుకునే మర్యాదా మన్ననలూ ఇరువురిమధ్యా పెరిగిన అనుబంధాలూ గూర్చి చెప్పడమే దీని లక్ష్యం తప్ప వేరుగాదనిమనవి.
------------------------------------------------------------------------------
నువ్వుంటే ఎంత బాగుండేదో
అని ప్రతి క్షణం ప్రతీక్షగా
ఎదురుతెన్నులతో నిరీక్షిస్తుంటాను.
ఆగకుండా దగ్గు తెరలుగా వచ్చి బాషిస్తున్నప్పుడూ
అప్పుడప్పుడూ వచ్చే జ్వరమైనా ఒక్కోసారి
ససేమిరా తగ్గనని మొండికేసినప్పుడూ
రావుగారూ మీరు బీ పీని మధుమేహాన్నీ
వెనువ్రంటనే నియంత్రించాలని ఆదేశించినప్పుడూ
నుబ్బేగనుక నా ప్రక్కన వుండి వుంటే ఎంత బాగుండునో
అని చాలాసార్లు అగణితంగా చెవుల్లోరింగుమంటూ
కలవరపెడుతుంది మనసు నువ్వే గనుక ఉండుంటే
ఎంత బాగుండునో అని,కనుకొలకుల్లోనీరు అడ్డొచ్చినా
నీ నగుమోమే నన్ను ముందుకు నడిపిస్తున్నదన్న మాట
మాత్రన్ బిరభ్యంతరంగా అక్షర సత్యం సుమా!!

నీ మనుమరాలు అన్విత మొన్న వాళ్ల ఇంటికెళితే
తాతా ఈసారి మన ఇండియాకెళ్ళినప్పుడు అమ్మమ్మను తెద్దాం
అక్కడ ఒక్కతే ఎందుకు పాపం--నువ్వుతాంతి[కాంతికి తన పలుకు బడి]
తను మాదగ్గరుంటుందిలే తాతా అని అనునయంగా చెబుతున్నప్పుడు
ఇంకోమనుమరాలికి [ఊహంటూ తెలిసి రాకుండానే నువ్వు నిష్క్రమించావులే] శ్రీ సమిటకి ఫుటొళొ నిన్ను చూపి నాబమ్మ ఎజ్జడుంది అని చిట్తి చేతులను ప్రశ్నార్ధకంగా తిప్పుతూ అడిగినప్పుడూ
నువ్వు ఆఖరి సారిగా నీ మనుమడిని[ప్జోనులోనే]నేను నిన్ను చూసి గేవపడుతున్నానురా కన్నా అని సందేశాన్ని ఆసుపత్రి మంచం మీదనుంచేఅందిస్తున్నప్పుడూఇంత సంతో షాన్ని వదిలి ఎలా వెళ్లగలిగావా అని ఆశ్చర్య పదూతుంటాబు,
========================================

Tuesday, April 21, 2015

మావూరు పేరు వినగానే ఠక్కున గుర్తుకొచ్చేది
కిష్టయ్యగారు.పేరుకు గుడిపూడి రామకృష్ణయ్యే
అయినా అందరికీ పరిచయమైన పేరు కిష్టయ్యగారు.
ధనుర్మాసంలో దేవుడి చిత్రపటాన్ని పట్టుకుని నడిచేది
మా పిచ్చి సుబ్బాయ్యే అయినా ,వెనుకనుండి వెన్నెముకైనడిపే
నగర సంకీర్తనా చార్యుడు మా కిష్టయ్య గారే.
ఉద్యోగం గ్రామీణ వైద్య శాలలో అనధికారంగా కాంపౌండర్.
దాక్టరుగారికన్నా ఒకరకంగా చెప్పలంటే ఒక పిసరు
సిఫారసు గలిగిన వ్యక్తి ఈయనేనని మనం నిరాటంకంగా
చెప్పుకోవచ్చు.ఊర్లో యే సుభకార్యమైనా ఆయనకు ఆహ్వానమందకుండా ఆ కార్యక్రమం జరగదనే చెప్పుకోవాలి.

ఆయనలో భక్తిపారవస్యం మెండు.రోజూ ఒకరి ఇంట్లో క్రమం తప్పకుండా జరుగే భజన కార్యక్రమంలో మాకిష్టయ్యగారు
పదిసెట్ల    తాళాలూ,కంజీరా, ఢోలక్   ,గజ్జెలతో  ,  హాజరవాల్సిందే.
ఆయన దగ్గరున్న ఓ అద్భుతమైన కళ సెన్సారు వాడి కత్తెరతీసుకుని దిన,వారపత్రికల్లోని వాక్యాలను తనకనుకూలమైన రీతిలో కత్తిరించి, తలుపు చెక్కకో ఆయన ప్రత్యేకంగా అల్లించుకున్న తడికల గదికో అంటించి ఆనందపడదం.

ఆయనకు భార్యా వియోగమయినందు వళ్ళ ఇంట్లొ వెధరాలయిన అక్క పెళ్ళి మాటేత్తని తమ్ముడు అప్పయ్యా ఉండేవారు.కూతురు పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళింది అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా వవ్చి వెళ్ళేది.ఆయన కత్తిరింపుల కళాకౌశలం లో కొన్ని ఉదాహరణలు.

మైసూరులో దసరా ఉత్సవాలు

గుంటూరులో సత్యహరిశ్చంద్ర నాటకం
అదికాస్తా గుంటూరులో ఘనంగా దసరా ఉత్సవాలు
మైసూరులో సత్య హరిశ్చంద్రనాటక వైభవం.
అయి అందరినీ అలరించేవి.అదీ రాంకకృష్ణయ్యగారి ప్రతిభా ప్రభ. ఇలా ఇల్లంటా కత్తిరింపులూ అతికింపులే.

వాళ్ళక్క మాలక్షమ్మ గారినడిగితే ఆ మొదరొష్టపోడున్నాడుగా పనా పాటా అన్నంతిని కూచ్చొని ఇలాంటి నిర్వాకమేదో చేస్తుంటాదు.
==========================
-----------------------------------------------------

Friday, April 17, 2015

నవనవలాన్మేషం
====================

ఆవిడ ఆలోచనలన్నీ
పురాతనమైనవేననీ
అనిపించినా
అవెందుకోనాకు
నవనవోన్మేషంగానే
స్ఫురిస్తాయి.

ఎప్పటికీ అవి వాటి
తాజాదనాన్నిగానీ
అమాయకత్వాన్ని గానీ
శాంతికాముకత్వాన్నీ
కోల్పోదన్న మాట
మాత్రం నూటికి
 నూరు పాళ్ళూ వాస్తవం.

[ఓ ఆంగ్లకవితకు అనుసృజన]